Andhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి

During Babu's regime, Rayalaseema was treated unfairly every time. YSRCP State General Secretary Srikanth Reddy

Andhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి:ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని    వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట  శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాయచోటి వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా  సమావేశంలో  వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష లతో కలసి శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడారు .సాగునీటి ప్రాజెక్ట్‌ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు.

బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం.
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి,
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని  వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట  శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాయచోటి వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా  సమావేశంలో  వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష లతో కలసి శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడారు .సాగునీటి ప్రాజెక్ట్‌ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. తాజాగా రాయచోటి నియోజక వర్గంలోని సంబేపల్లె  పర్యటన సందర్భంగా సీఎం హోదాలో కొత్త విద్యాసంస్థలు, రాయచోటి నీటికష్టాలకు పరిష్కారంను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు తీవ్ర నిరాశను మిగిల్చారని అన్నారు.ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూలపురుషుడుగా, హైదరాబాద్‌ కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను సిగ్గు లేకుండా పరిచయం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని,అదే సమయంలో బెంగుళూరు ఎందుకు ముందుకు పోయిందన్నారు. వాస్తవానికి వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు  సీఎం అయిన తరువాత హైదరాబాద్‌ లో ఐటీ రంగం బెంగుళూరుకు సమాంతరంగా
గణనీయమైన ఆదాయాన్ని సాధించిందన్నారు.చంద్రబాబు హయాంలో కన్నా వైఎస్ఆర్ హయాంలో మూడింతలు ఐటి రంగం అభివృద్ధి చెందిందన్నారు.కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా తానే ఐటీని కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నాడు. చివరికి హైదరాబాద్‌ ను సైతం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పా

ఐటీ ఉద్యోగులను పక్కన పెట్టుకుని సంబేపల్లె లో  నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని అందరూ ఆశించారు.కానీ చంద్రబాబు చెంత ఉన్న ఐటీ ఉద్యోగులు ’మేం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం, మేం సంపాధించినది పార్టీ కోసం ఖర్చు చేశాం, ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నాం, గ్రామాల్లో మేమే పార్టీ బాధ్యత తీసుకున్నాం’ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాంతానికి సీఎం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడే అవకాశం లభించినప్పుడు యువతకు స్పూర్తిదాయకమైన మాటలు చెబుతారని అందరూ భావించారు. కానీ దానిని కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉంది. దానికి తగినట్లుగా చంద్రబాబు మండల స్థాయిలోనే ఐటీ టవర్స్‌ నిర్మిస్తాను, వర్క్‌ ఫ్రం హోంను కూడా తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరింత ఆశ్చర్యం కలిగించింది. వైయస్‌ జగన్‌  హయాంలో రాయచోటి ప్రజలకు నీటి కష్టాలు తప్పించేందుకు శ్రీశైలం రిజర్వాయర్‌ లో నీరు తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయంగా గండికోటలో నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశాం. హెచ్ ఎన్ ఎస్ ఎస్ ద్వారా   అనంతపురం జిల్లా దాటి నీళ్లు రావు కాబట్టి గండికోట నుంచి వెలిగల్లుకు  అనుసంధానం చేసే పక్రియను అమలుచేసామన్నారు.కాలేటివాగును ఒక టీఎంసీకి అభివధ్ధి చేసి, అక్కడి నుంచి వెలిగల్లుకు నీటిని పంపించేందుకు వీలుగా పనులకు శ్రీకారం చుట్టాం. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలోనే డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశాం. దాని మిగిలిన పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు తన పర్యటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు.రాయచోటి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఒక్క విద్యాసంస్థను కూడా ప్రకటించలేదు. మహిళా జూనియర్‌ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, రెండో ఇంజనీరింగ్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీ లను వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌ హయాంలో సాధించుకున్నాం.

రాయచోటిలో పీజీ కేంద్రం, తద్వారా యూనివర్సిటీ ఏర్పాటు కొరకు 100 ఎకరాలు భూమిని కూడా సేకరించి సిద్దంగా ఉంచామన్నారు. మదనపల్లెలో మెడికల్  కళాశాలను  ప్రైవేటీకరించ వద్దని, యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయాలని   విద్యార్ధులు ప్రశ్నిస్తే వారిని అరెస్టు చేసారన్నారు. కొత్త కలెక్టరేట్‌ భవనాలు, గండికోట నుంచి నీటని అందించే ప్రాజెక్ట్‌ వంటి వాటిపై చంద్రబాబు మాట్లాడతారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను వంచించారు. కర్నూలులో శాశ్వత హైకోర్ట్‌ కావాలంటే, దానికి బదులుగా బెంచ్‌ తో సరిపెట్టారు. కొప్పర్తి పారిశ్రామికవాడను ఆనాడు వైయస్‌ఆర్, ఆ తరువాత వైయస్‌ జగన్‌ ప్రత్యేక సెజ్  గా అభివద్ధి చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు చొరవ చూపాలి. చేసింది చెప్పాలే కానీ జరిగిందంతా తానే చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.సీఎంగా వైయస్‌ జగన్‌  గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పనులు చేసుకోవాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిని కొనసాగించకుండా చంద్రబాబు ఆ నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు మండల స్థాయిలో ఐటీ టవర్స్‌ నిర్మిస్తానని చెప్పడం  చంద్రబాబు రెండు నాలుకల దోరణికి, ద్వంద వైఖరికి నిదర్శనం.సంపద సృష్టించడం గురించి ప్రజలకు చెప్పడం కాదు, వారు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం పని చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రిగా ఆదుకున్నది వైయస్‌ జగన్‌ . ఈ రోజు అన్ని అవకాశాలు ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోటిన్నర మందికి పైగా అర్హులైన మహిళలు చంద్రబాబు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. యాబై ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్‌ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ ఏడాది రైతుభరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు ఏనాడూ తన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నా, ఆయన ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేస్తే, తరువాత దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు వృథా అని మాట్లాడారు. హంద్రీనీవా నుంచి 40 టీఎంసీలు రావు.  కేవలం 5 టీఎంసీల నీరే వస్తాయని ఏకంగా జీఓ ఇచ్చారు. అలాగే గండికోటను 20 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు కుదించి జీఓ ఇచ్చారు. డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ ను అయిదేళ్ళలో అడివిపల్లి వరకు 90 శాతం కాలువ పనులు పూర్తి చేశారు. 27 టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్ట్, దానిలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన ఘనత వైయస్‌ జగన్‌ గారిది. చంద్రబాబు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కృష్ణా బ్యారేజీ వద్ద టీడీపీ వారితో ధర్నాలు చేయించారు.ఆనాడు వైయస్‌ రాజశేఖరరెడ్డిగారి పుణ్యం వల్లే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరు అందుతోంది. ఏడు నెలలు ఇన్‌ ఫ్లో ఉన్న కష్ణానదిలో ఈ రోజు డెడ్‌ స్టోరేజీ స్థాయికి నీటిని తోడేశారు. రాయలసమీకు ఎలా నీరు ఇస్తారో చంద్రబాబు చెప్పాలి. గతంలో పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎలా ఇస్తారో చెప్పండి అంటే దానిపై మాట్లాడరు.ఇప్పుడు కొత్తగా బనకచర్ల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బనకచర్ల క్రాస్‌ నుంచి సరైన అవగాహన చంద్రబాబుకు లేదు. దీనిని ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పగలరా? రాష్ట్ర ప్రజలకు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు కుదిస్తున్నా చంద్రబాబు మాట్లడటం లేదు. పోలవరం నుంచి కష్ణా బ్యారేజీకి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు, అక్కడి నుంచి వెలుగొండ ద్వారా బనకచర్ల క్రాస్‌ కు నీటిని తరలిస్తారో సరైన ప్రణాళిక ఉందా? అని శ్రీకాంత్ రెడ్డి  ప్రశ్నించారు.గండికోట నుంచి  మనకు కాలేటి వాగు ద్వారా వెలిగల్లు కు  కలపడం ద్వారా  గాలేరు నగరి నుంచి వచ్చేది సులభమవుతుందన్నారు. అనంతపురం  జిల్లా నుంచి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అది చేస్తేనే ఉపయోగ కరమన్నారు.వెలిగల్లు నుంచి  లిఫ్ట్ కు, మిట్ట చెరువులకు,  కాలేటి వాగు ద్వారా లక్కిరెడ్డిపల్లె, రామాపురం లకు ,దీర్ఘ ప్రణాళికలు చేసి ముందడుగు వేశామని కరోనా వల్ల పనులు ఆలశ్యమయ్యాయన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతనే వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన ప్రాజెక్ట్ లకు రూపకల్పన జరిగి పూర్తయ్యే అవకాశం కల్గిందన్నారు.వైఎస్ఆర్ పెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ తోనే పేదలు ఇంజనీరింగ్,ఎం బిఎ,ఎం సి ఏ లు చదవగలిగారన్నారు.జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలు కడితే..ప్రయివేట్ పరం చేయాలన్న ఉద్దేశ్యంతో  ఎం సి ఐ ఇచ్చిన మెడికల్ సీట్లను మీరు వద్దన్నారన్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 75 వేల మెడికల్ సీట్లు ఇస్తామని ప్రకటించారని, మీరు అప్పుడు మెడికల్ కాలేజీలను టెక్ అప్ చేసి ఉండి ఉంటే ఇప్పుడు మెడికల్ కళాశాలలకు మంచి జరిగివుండేది కదా అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Read more:లావణ్య త్రిపాఠి కొత్త సినిమా ముచ్చట్లు: Lavanya Tripathi new movie

 

Related posts

Leave a Comment